తెలంగాణ : రాష్ట్రంలో భూ లావాదేవీలను మరింత పారదర్శకంగా నిర్వహించి, రైతులకు అత్యుత్తమ సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. మంగళవారం సచివాలయంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క అధ్యక్షతన జరిగిన 2026-27 బడ్జెట్ సన్నాహక సమావేశంలో పాల్గొన్న ఆయన, భూ సమస్యల పరిష్కారంలో జాప్యాన్ని నివారించడానికి రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, సర్వే విభాగాలను ఒకే గొడుగు కిందకు తెస్తూ, ప్రత్యేక పోర్టల్ను అందుబాటులోకి తెస్తామన్నారు. అత్యాధునిక ‘రోవర్’ పరికరాలతో భూముల సర్వే నిర్వహిస్తామని ప్రకటించారు.