Wednesday, February 25, 2026
advt
Homeతాజా వార్తలుకేటీఆర్‌కు మరో ప్రతిష్టాత్మక ఆహ్వానం..

కేటీఆర్‌కు మరో ప్రతిష్టాత్మక ఆహ్వానం..

హైద‌రాబాద్ : బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు మరో ప్ర‌తిష్టాత్మ‌క‌ ఆహ్వానం అందింది. దేశంలోనే అత్యుత్తమ ఇంజనీరింగ్ విద్యాసంస్థల్లో మొదటి వరుసలో నిలిచే ఐఐటీ మద్రాస్ తమ విద్య సంస్థలో జరిగే అంట్ర‌పెన్యుర‌ల్ స‌మ్మిట్ అనే కార్యక్రమంలో ప్రసంగించాల్సిందిగా కేటీఆర్‌ను ఆహ్వానించింది. ప్రతి ఏటా ఐఐటీ మద్రాస్ ఆధ్వర్యంలో నిర్వహించే అంట్రపెన్యురల్ ఫెస్టివల్ (E-Summit) ఈ- సమ్మిట్ లో కీలకోపన్యాసం చేయాలని కోరింది.

ఐఐటీ మద్రాస్‌లో ప్రతి ఏటా నిర్వహించే ఈ- సమ్మిట్‌కు దేశ విదేశాల నుంచి అంట్రపెన్యురల్ రంగంలో కీలకమైన వ్యక్తులను, సంస్థల అధిపతులను, పాలసీ మేకర్లను, ప్రముఖ వ్యక్తులను ఆహ్వానిస్తుంది. కేటీఆర్‌కున్న అపారమైన అనుభవాన్ని పురస్కరించుకొని, భవిష్యత్తు అంట్రపెన్యురల్ ఔత్సాహికులకు దిశా నిర్దేశం చేయాల్సిందిగా కేటీఆర్‌కు పంపిన ఆహ్వానంలో ఐఐటీ మద్రాస్ పేర్కొంది.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -advt

Most Popular

Recent Comments